అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఓ సరికొత్త కథా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుందంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హక్కులు కొనుగోలు చేసిందని నెట్టింట్లో వరుస పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్రబృందం నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఫుల్ టైమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన తమకు లేదని స్పష్టతనిచ్చింది. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాకే రిలీజ్ డేట్ని మరోసారి ప్రకటిస్తామని చిత్రబృందం తెలిసింది.
ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే నటించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అప్పట్లో చిత్రబృందం ప్రకటించిన విషయం విదితమే. ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం.