బాల కృష్ణ నందమూరి శ్రుతి హసన్తో కలిసి నటించబోతున్నారా?
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. చిత్రానికి సంబంధించి దర్శకుడు పనులు మొదలుపెట్టారు. ఇందులో నాయికగా శ్రుతిహాసన్ను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ దర్శకత్వంలో శ్రుతిహాసన్ పలు సినిమాలు చేసింది. ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్’లోనూ నాయికగా అలరించింది. బాలయ్య సినిమా కోసం గోపీచంద్ – శ్రుతిహాసన్ని సంప్రదించారని, అందుకు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పుకొంటున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చేస్తున్నారు. సినిమాని దసరా నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పుడే సినిమాని ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రుతిహాసన్ – ప్రభాస్ కథానాయకుడిగా ‘సలార్’లో నటిస్తోంది.