మాస్ పల్స్ తెలిసిన నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్ను శనివారం సాయంత్రం ఎంతో వేడుకగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడిటోరియం అభిమానులతో కిక్కిరిసిపోయింది
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి నటసింహం బాలకృష్ణ గారు , దర్శకుడు బోయపాటి శ్రీను , ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ , మరి ఆత్మీయ అతిధి గా దర్శకుడు రాజమౌళి , చిత్రబృందం ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ , సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు.
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి గారు జై బాలయ్య అనే వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ అఖండ మాస్ ట్రైలర్ 2 రిలీజ్ చేసారు.
దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ బాలయ్యబాబు గారి ఎనర్జీ లెవల్స్ చాలా బాగుందని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో తన కుటుంబ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత సినీ పరిశ్రమలో బాలకృష్ణ తప్ప మరెవ్వరూ సుదీర్ఘమైన డైలాగ్స్ చెప్పలేరని అల్లు అర్జున్ అన్నారు
దర్శకుడు బోయపాటి శ్రీను గారు , బాలయ్య బాబు గారికి సినిమా పట్ల ఉన్న అంకితభావం గురించి చెప్పారు, బాల కృష్ణ గారికి కుడి చేయి భుజానికి గాయం అయిన కూడా పట్టుదలతో జై బాలయ్య పాట షూటింగ్ లో పాల్గున్నారు అని అన్నారు. కరోన కష్టకాలం లో సినీపరిశ్రమ ఎంతగానో ఇబ్బంది పడింది అని, కరోన వల్ల అఖండ సినిమా 21 నేలలు జరిగిందనీ, అయినా కూడా నిర్మాతలు ఏ మాత్రం వెనకాడకుండా మాకు అండగా ఉన్నారని దర్శకుడు బోయపాటి శ్రీను గారు అన్నారు. ఈ అఖండ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు తిరిగి అన్ని మoచి రోజులు వస్తాయని, పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి బ్యాక్ టు బ్యాక్ టాప్ సినిమాలతో సినిమా పరిశ్రమ మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది అని దర్శకుడు బోయపాటి శ్రీను గారు అన్నారు
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు మాట్లాడుతూ అఖండ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అని, ఇది ఒక మంచి ఆధ్యాత్మిక చిత్రం , మాస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది అని , అందరు నటినటులు వారి వారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఎంత బాగా నటించారు అని అన్నారు. ప్రేక్షక దేవుళ్ళు , అభిమానులు ఎప్పుడు క్రమశిక్షణతో సేవ ద్రుత్పధం తో ముందుకు నడుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసారు నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. అఖండ మరియు అఖండ తరువత విదుదలయ్యె పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలకు శుభకాంక్షలు తెలియజేసారు. అభిమానుల నుండి జై బాలయ్య జై బాలయ్య నినాదాలతో ఆడిటోరియం మొత్తం హోరెత్తిపోయింది.